- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Prashanth Kishore: భారత రాజకీయాల్లో మరో సంచలనం.. ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ
by Shiva |
X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐ ప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు. ఆదివారం పాట్నాలో నిర్వహించిన ‘జన్ సురాజ్’ రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. బిహార్ కేంద్రంగా ‘జన్ సురాజ్’ పేరుతో ఓ ప్రజా చైతన్య సంస్థ రన్ చేస్తున్నానని పేర్కొన్నారు. అయితే, అదే పేరును తాను కొత్తగా పెట్టబోయే పార్టీకి నామకరణం చేస్తున్నట్లుగా ప్రకటించారు. అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా ‘జన్ సురాజ్’ పార్టీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. అయితే, 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘జన్ సురాజ్’ బరిలోకి దిగుతుందని, ఒంటరిగానే జేడీయూ అధినేత సీఎం నితీశ్ కుమార్ను ఎదుర్కొంటామని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
Advertisement
Next Story