మే 31న భారత్‌కు ప్రజ్వల్..జర్మనీ నుంచి బెంగళూరుకు టికెట్ బుక్ !

by vinod kumar |
మే 31న భారత్‌కు ప్రజ్వల్..జర్మనీ నుంచి బెంగళూరుకు టికెట్ బుక్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక సెక్స్ స్కాండల్‌ కేసులో ప్రధాన నిందితుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈ నెల 31వ తేదీన భారత్‌కు రానున్నట్టు తెలుస్తోంది. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బెంగళూరుకు విమానంలో బుక్ చేసుకున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరులో దిగే అవకాశం ఉంది. కుంభకోణంపై విచారణ జరుపుతున్న సిట్ బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో నిఘా ఉంచిందని, తద్వారా ప్రజ్వల్ దిగిన వెంటనే అరెస్టు చేయొచ్చని తెలుస్తోంది. అయితే ప్రజ్వల్ గతంలో రెండుసార్లు జర్మనీ నుంచి తన విమాన టిక్కెట్‌ను రద్దు చేసుకున్నారు. దీంతో ఈసారైనా వస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మే 31న సిట్ విచారణకు హాజరవుతానని ప్రజ్వల్ మే 27న వీడియో సందేశంలో తెలిపారు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. కాగా, హసన్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన హసన్ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఏప్రిల్ 26న దేశం విడిచి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన విదేశాల్లోనే ఉన్నారు.

Advertisement

Next Story