ప్రధాని ఇంట్లో రక్షాబంధన్‌ వేడుకలు..

by Vinod kumar |
ప్రధాని ఇంట్లో రక్షాబంధన్‌ వేడుకలు..
X

న్యూఢిల్లీ : అక్కా-తమ్ముళ్ల, అన్నా-చెల్లెళ్ల మధ్య అవినాభావ సంబంధాలకు, అపారమైన ప్రేమకు రాఖీ పండుగ నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రజల జీవితాల్లో ఆప్యాయతలను, సామరస్య భావాలను బలోపేతం చేయడంలో ఇలాంటి పండుగలే కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. బుధవారం ఉదయం న్యూఢిల్లీలోని తన నివాసంలో పిల్లలతో కలిసి ప్రధాని మోడీ రక్షా బంధన్‌ వేడుకలు జరుపుకున్నారు. ఢిల్లీలోని పాఠశాలల విద్యార్థినులు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు.

ఈక్రమంలో మోడీ చెంపపై ఓ చిన్నారి ముద్దు పెట్టింది. ఈసందర్భంగా విద్యార్థులతో ప్రధాని కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. విద్యార్థుల పేర్లు, క్లాస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు పిల్లలు పద్యాలు , పాటలు పాడి మోడీకి వినిపించారు. ఇండియా విజయం సాధించిన చంద్రయాన్-3 మిషన్, త్వరలో చేపట్టనున్న ఆదిత్య L-1 మిషన్ లపైనా ప‌ద్యాలు, కవితలు రాయాలని స్టూడెంట్స్ కు ప్రధాని సూచించారు. అనంతరం స్కూల్ టీచర్లతో ఆయన గ్రూప్ ఫోటో దిగారు.

Advertisement

Next Story

Most Viewed