వికసిత్ భారత్ కోసం దేశ ప్రజలు మాపై నమ్మకం ఉంచారు: ప్రధాని మోడీ

by Mahesh |
వికసిత్ భారత్ కోసం దేశ ప్రజలు మాపై నమ్మకం ఉంచారు: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్‌లో ప్రధాని మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతుండగా.. మణిపూర్, నీట్ అంశాలపై మోడీ స్పందించాలంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా వారిపై ఫైర్ అయ్యారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తొందని.. తాము వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రజలను ఓట్లు అడిగామని.. దేశ ప్రజలు తమపై నమ్మకం ఉంచి మరోసారి అధికారం అందించారని గుర్తు చేశారు. ఎలాగైనా గెలవాలని దుర్బుద్దితో కొంతమంది అబద్దాలను ప్రచారం చేశారని.. అయినప్పటికీ వారు ఓడిపోయారని ప్రధాని మోడీ ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పటికి నుంచి దేశ ప్రజలకు అవినీతి రహిత పాలన అందించామని.. గతంలో మాత్రం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట కుంభకోణం వార్తలు వచ్చేవని అన్నారు. ఎన్డీయే కూటమి పాలనలో వికసిత్ భారత్‌లో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. కానీ విపక్షాలు మాత్రం సభలో ప్రధాని మోడీ ప్రసంగానికి అడుగడుగునా అడ్డుతగులుతూ వచ్చారు. అయినప్పటికి ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు.

Next Story

Most Viewed