- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Manish Sisodia: త్వరలోనే కేజ్రీవాల్ బయటకొస్తారు
దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో విడుదలవుతారని మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. శనివారం ఉదయం కన్నౌట్ లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత సిసోడియా మాట్లాడుతూ.. "ఢిల్లీ ప్రజలందరినీ హనుమంతుడు ఆశీర్వదిస్తాడు. హనుమంతుడి ఆశీర్వాదంతో ఈ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలో విడుదలవుతారు” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడ్నుంచి రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించారు. సిసోడియాతో పాటు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు, ఎంపీ సంజయ్ సింగ్ మరియు మంత్రులు అతిషి మరియు సౌరభ్ భరద్వాజ్ ఉన్నారు. గతేడాది ఫిబ్రవరి 26న ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా అరెస్టయ్యారు. శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.