నితీశ్ కింగ్ మేకర్ అయితే బిహార్‌కు ప్రత్యేక హోదా తేవాలి: తేజస్వీ యాదవ్

by vinod kumar |
నితీశ్ కింగ్ మేకర్ అయితే బిహార్‌కు ప్రత్యేక హోదా తేవాలి: తేజస్వీ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేలో ‘కింగ్ మేకర్’ హోదాను ఉపయోగించుకోవాలని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీయేకు సంఖ్యాబలం ఉందని, కానీ బిహార్‌కు ప్రత్యేక హోదా తీసుకొచ్చే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ‘నితీశ్ కింగ్‌మేకర్‌ అయితే ఇది మంచి అవకాశం. బిహార్‌కు ప్రత్యేక హోదా వచ్చేలా చూడాలి. దేశం మొత్తంలో కులగణన నిర్వహించేలా చొరవ చూపాలి’ అని వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వ బిహార్‌కు మద్దతుగా ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. మోడీ మాయాజాలం ముగిసిందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిత్రపక్షాలపై ఆధారపడి ఉండాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీయే, ఇండియా కూటముల సమావేశాలనికి నితీశ్, తేజస్వీలు ఒకే విమానంలో వెళ్లడం సంచలనం రేపింది. అయితే దీనిపై స్పందించిన తేజస్వీ..నితీశ్ వెనుక నాకు సీటు కేటాయించారని ఇద్దరం ఒకరినొకరం పలకరించుకకున్నామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story