- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అసలు ఊహించలేదు!.. డీకే శివకుమార్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధానమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మంగళసూత్ర వ్యాఖ్యలపై స్పందించారు. ప్రధానమంత్రి మంగళసూత్రాల గురించి మాట్లాడటం అందరూ విన్నారని, ఒక ప్రధానమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని తాను అసలు ఊహించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ సంస్కృతిని కాపాడుతుందని, అన్ని మతాలను గౌరవిస్తుందని తెలియజేశారు. అలాగే మంగళసూత్రం అనేది ప్రతీ మహిళ జీవితంలో ఒక భాగం అని, దానిని మేము గౌరవిస్తామని, మహిళల హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. తన తల్లి సోనియా గాంధీ దేశం కోసం, దాని సమగ్రత కోసం తన మంగళసూత్రాలను కోల్పోయారని ప్రియాంక గాంధీ బావోధ్వేగా హృదయంతో అన్నారని గుర్తు చేశారు. కాగా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ మంగళ సూత్రాలను కూడా తీసుకెళ్లి అమ్ముకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.