ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. పద్మశ్రీ మొగులయ్యకు ఆర్థిక సాయం

by Disha Web Desk 12 |
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. పద్మశ్రీ మొగులయ్యకు ఆర్థిక సాయం
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రేసిడెంట్ కేటీఆర్ పద్మశ్రీ మొగులయ్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల పద్మశ్రీ మొగులయ్య తన కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలి పని చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో పై స్పందించిన కేటీఆర్ తాను, తన టీమ్ అండగా ఉంటామని ట్విట్టర్ వేదికగా హామి ఇచ్చారు. ఈ క్రమంలో నేడు కిన్నెర వాయిద్యకారుడు అయిన మొగులయ్యను వ్యక్తిగతంగా కలిసిన కేటీఆర్ ఆర్థిక సహాయం అందించారు. ఈ సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ వేంట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద, ఏంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. కాగా తనకు ఆర్థిక సహాయం అందించినందు కేటీఆర్‌కు మొగులయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Next Story