- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Mehabooba Mufti: బీజేపీతో పొత్తు ఉండదు.. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మాత్రం పీడీపీనే అని తెలిపారు. తమ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. శ్రీనగర్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటోందన్నారు. 1947 నుంచి అలానే చేస్తున్నారని వారికి అంతకుమించి వేరే లక్ష్యం లేదని ఆరోపించారు. కేవలం మంత్రి పదవుల కోసమే పొత్తు పెట్టుకుంటున్నారని తెలిపారు.
పీపీడీ మద్దతు లేకుండా ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. 2002లో కేవలం 16 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఏర్పాటు చేశామని ప్రస్తుతం సైతం అలాంటి తరహా పరిస్థితులే నెలకొంటాయని తెలిపారు. తమ ఎజెండాను అమలు చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టామని చెప్పారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం బీజేపీతో గతంలో చేతులు కలిపామని, కానీ బీజేపీ కశ్మీర్ అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రయత్నాలను తోసిపుచ్చిందని తెలిపారు. అందుకే ఆ పార్టీతో పొత్తు అవకాశమే లేదని వెల్లడించారు. బీజేపీతో పీడీపీకి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. పోలీసులు ప్రజలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధించడం మొదలు పెట్టారని ఈ చర్యలను వెంటనే ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు.