- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Manipur violence: మణిపూర్లో ఇరువర్గాల మధ్య కాల్పులు.. ఇళ్లకు నిప్పు
ఇంఫాల్: మణిపూర్లోని బిష్ణుపుర్ జిల్లాలో ఉద్రిక్తత ఏర్పడింది. మొయిరాంగ్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. అల్లరి మూకలు కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు మీడియాకు తెలిపారు. భయంతో రాత్రంతా తాము నిద్రపోలేదని చెప్పారు. స్థానికంగా పరిస్థితి సద్దుమణిగే వరకు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇక తమకు ప్రత్యేక పరిపాలనా మండలి కావాలని కోరుతూ కుకీ-జో వర్గానికి చెందిన వారు గురువారం కాంగ్పోక్పి జిల్లాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్ఓఓ) ఒప్పందంపై సంతం చేసిన కుకీ వర్గంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాగా, త్వరలోనే మణిపూర్లో విపక్ష నేతలు పర్యటించనున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో విపక్ష కూటమికి చెందిన 20 మంది పార్లమెంట్ సభ్యులు మణిపూర్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటారని కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు.