ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

by Vinod kumar |
ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
X

న్యూఢిల్లీ : తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే సంచలన ఆరోపణలు చేశారు.లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు మహువా ముడుపులు అందుకున్నారని కామెంట్ చేశారు. ఈ మేరకు ఆరోపణలతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆయన లేఖ రాశారు. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌ చేసి మాట్లాడేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి ఎంపీ మహువా రూ.2 కోట్లు, ఐఫోన్‌, ఎన్నికల ఖర్చుకు మరో రూ.75 లక్షలను తీసుకున్నారని తన లేఖలో నిషికాంత్‌ దూబే పేర్కొన్నారు.

‘‘2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు అడిగినవే. దీనికి సంబంధించిన సాక్ష్యాలను ఓ న్యాయవాది నాకు అందజేశారు. తక్షణమే మహువాను లోక్ సభ నుంచి సస్పెండ్‌ చేయాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తుకైనా రెడీ అని మహువా స్పష్టం చేశారు. నిషికాంత్‌ దూబేపై నకిలీ అఫిడవిట్లు, ఇతర అభియోగాలపై దర్యాప్తును పూర్తి చేశాక తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తానన్నారు. ఇక బీజేపీ ఎంపీ ఆరోపణల్ని హీరానందానీ గ్రూప్‌ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసం తాము ఎల్లప్పుడూ ప్రభుత్వంతోనే కలిసి నడుస్తామని తేల్చి చెప్పింది.

Advertisement

Next Story