Mizoram bridge collapse: కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. పెరిగిన మృతుల సంఖ్య

by Vinod kumar |   ( Updated:2023-08-23 11:06:32.0  )
Mizoram bridge collapse: కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. పెరిగిన మృతుల సంఖ్య
X

ఐజ్వాల్: మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కుప్పకూలింది. దీంతో 26 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో సాయిరంగ్ ప్రాంతంలో రైల్వే వంతెన నిర్మాణం జరుగుతోంది. ఉదయం 10 గంటల సమయంలో సుమారు 45 నుంచి 50 మంది కార్మికులు నిర్మాణ విధుల్లోకి దిగారు. పనులు మొదలైన కాసేపటికే ఆ వంతెన కుప్పకూలింది. శిధిలాల కిందనే కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రెస్క్యూ టీమ్స్ బయటికి తీశాయి. ఈ ప్రమాదంపై మిజోరం ముఖ్యమంత్రి జొరామ్ థాంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

Advertisement

Next Story