మోడీ తేనీటి విందుకు ఆహ్వానం అందుకున్న నేతలు

by Harish |   ( Updated:2024-06-09 08:08:12.0  )
మోడీ తేనీటి విందుకు ఆహ్వానం అందుకున్న నేతలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో కొత్త మంత్రివర్గ కూర్పు ఏర్పాటు గురించి ఇప్పటికే మంతనాలు పూర్తయ్యాయి. బీజేపీ ఈసారి సొంతంగా మెజారిటీ సాధించని కారణంగా తన మిత్రపక్షాల సహయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో దాని మిత్రపక్షాలకు కూడా మంత్రివర్గంలో బెర్తులు ఖరారు చేశారు. అయితే ప్రమాణస్వీకారానికి ముందు మోడీ తన నివాసంలో ఆదివారం ఉదయం 11.30 గంటలకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. దీనికి తన కొత్త మంత్రివర్గం మెంబర్స్‌ను ఆహ్వానించారు.

ఈ విందుకు ఆహ్వానించబడ్డ నేతలు ఎవరో ఒకసారి చూద్దాం..రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అర్జున్ రామ్ మేఘవాల్, చిరాగ్ పాశ్వాన్, హెచ్‌డి కుమారస్వామి, సర్బానంద సోనోవాల్, ప్రహ్లాద్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రశేఖర్ పెమ్మసాని, రామ్ మోహన్ నాయుడు, రామ్ నాథ్ ఠాకూర్, లాలన్ సింగ్, ప్రతాప్ రావ్ జాదవ్, కె అన్నామలై, అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, ML ఖట్టర్, చంద్రశేఖర్ చౌదరి, జయంత్ చౌదరి, మన్సుఖ్ మాండవియా, అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు, రక్షా ఖడ్సే, కమల్జీత్ సెహ్రావత్, రావ్ ఇంద్రజిత్ సింగ్, రాందాస్ అథవాలే, జితన్ రామ్ మాంఝీ, గిరిరాజ్ సింగ్, బండి సంజయ్, సురేష్ గోపి, కిషన్ రెడ్డి, శోభా కరంద్లాజే, హర్ష్ మల్హోత్రా, ఎస్ జైశంకర్.

Advertisement

Next Story

Most Viewed