- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కు మరో షాక్
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ రాష్ట్ర మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ పలువురు ఆప్ నేతలతో పాటు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ దాఖలు చేసిన ఈ కేసులో కేజ్రీవాల్ జూన్లోనే సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ తెచ్చుకోగా.. అంతలోపే సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ, విచారణ వాయిదాలు పడుతోంది. తాజాగా ఈ కేసులో కేజ్రీవాల్ ను సీబీఐ విచారించేందుకు కోర్టు అనుమతులు జారీ చేసింది. సీఎం కేజ్రీవాల్ తో పాటు, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ ను కూడా విచారించేందుకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆగస్టు 27తో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండగా.. అంతలోనే కోర్టు ఈ అనుమతులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.