- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
50 ఏళ్లలో కాంగ్రెస్ ప్రధానులు అద్భుతంగా పనిచేస్తే.. మోడీ దేశాన్ని వేలం పెట్టారు: సంజయ్ రౌత్
దిశ, నేషనల్ బ్యూరో: శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీ పై ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో మొత్తం 70 ఏళ్ల పరిపాలన కాలంలో దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రధాన మంత్రులను అందించిందని, వారంతా కూడా అద్భుతంగా పనిచేశారని, పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ లాంటి వారి పరిపాలనలో దేశం అభివృద్ధి పథంలో నడిచిందని సంజయ్ రౌత్ కాంగ్రెస్ను ప్రశంసించారు. అయితే వీరంతా కలిసి నిర్మించిన భారత దేశాన్ని ప్రధాని మోడీ "వేలం" పెట్టారని, ప్రధాని పదవికి కూడా వేలం పాట ఉందా? దానిని కూడా మోడీ వేలం వేశారా? అని తీవ్రంగా విమర్శించారు.
2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత "మోడీ, ఆయన పార్టీ అధికారంలో ఉండదు." బీజేపీకి తాము ఓడిపోతామని తెలుసు, అందుకే వారు రాముడి పేరు చెప్పుకుని గెలవాలనుకుంటున్నారు, కానీ రాముడి వారితో లేరని సంజయ్ రౌత్ అన్నారు. ఎన్నికల తర్వాత ప్రజల గురించి, ప్రజాస్వామ్య భవిష్యత్తు గురించి ఆలోచించే సమర్థుడైన వ్యక్తి ఈ దేశానికి నాయకుడవుతారని సంజయ్ రౌత్ ఉద్ఘాటించారు. బుధవారం అమిత్షా మాట్లాడుతూ, శివసేన అధ్యక్షుడి ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ రాముడి 'ప్రాణ్ ప్రతిష్ఠ'కు హాజరుకాకపోవడం ద్వారా శ్రీరాముడిని అవమానించారని అన్నారు. దీనికి కౌంటర్గా సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.