- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గోపాల్రావుపేట 54 ఫీట్ల జాతీయ జెండాపై బీఆర్ఎస్, బీజేపీ మాటల యుద్ధం
దిశ, రామడుగు: పైసలు ఇచ్చింది మేమైతే ప్రచారం చేసుకునేటోళ్లు బీజేపీ వాళ్లంటూ రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు విమర్శలు చేశారు. రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలో గత నెలలో ఏర్పాటు చేసిన 54 ఫీట్ల జాతీయ జెండా ఆవిష్కరణ ఎంపీ బండి సంజయ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ జాతీయ జెండా నిర్మాణానికి ఎంపీ నిధుల కింద బండి సంజయ్ మూడు లక్షలు మంజూరు చేశారు. శనివారం రాత్రి రామడుగు మండలం గుండి గోపాల్రావుపేట్ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రచార కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా రామడుగు సింగిల్ విండో చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు వీర్ల వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాయకులపై జాతీయ జెండా విషయంలో విరుచుకుపడ్డారు. గోపాల్ రావు పేట గ్రామంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా నిర్మాణం కోసం డబ్బులను బీఆర్ఎస్ నాయకులు ఇస్తే బీజేపీ నాయకులు ఇచ్చారని చెప్పుకోవడం సొమ్మొకడిది సోకొకడిది అంటూ బీజేపీ నాయకులపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. దీంతో ఎన్నికల ప్రచారం ఏమో కానీ గోపాల్రావుపేట లో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ అభివృద్ధి నిర్మాణం పై బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయే విధంగా వివాదం నెలకొంది.