జర్నలిస్టుల భద్రతపై త్వరలోనే మార్గదర్శకాలు : కేంద్రం

by Vinod kumar |
జర్నలిస్టుల భద్రతపై త్వరలోనే మార్గదర్శకాలు : కేంద్రం
X

న్యూఢిల్లీ : జర్నలిస్టుల భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసే ప్రక్రియ చివరి దశలో ఉందని కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు తెలిపింది. జర్నలిస్టుల వ్యవహారాలతో ముడిపడిన వివిధ విభాగాలు, సంస్థలతో సంప్రదింపులు జరిపి ఈ విషయంలో విధి విధానాలను ఖరారు చేస్తామని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు.

ఈ అంశంపై రెగ్యులర్‌గా కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు సలహాలను జారీ చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల భద్రతకు సంబంధించిన ప్రత్యేక సూచనలను 2017 అక్టోబర్ 20న రాష్ట్రాలకు, యూటీలకు జారీ చేశామని ఆయన గుర్తు చేశారు.

Advertisement

Next Story