ఎన్‌డీఏకు రికార్డు స్థాయిలో ఓట్లు.. ప్రధాని మోడీ ట్వీట్

by Dishanational4 |
ఎన్‌డీఏకు రికార్డు స్థాయిలో ఓట్లు.. ప్రధాని మోడీ ట్వీట్
X

దిశ, నేషనల్ బ్యూరో : తొలి దశ లోక్‌సభ ఎన్నికల్లో 60 శాతం ఓటింగ్‌ నమోదైందని, బీజేపీకి గొప్ప స్పందన వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ ప్రజలు రికార్డు స్థాయిలో నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కూటమికి ఓట్లు వేస్తున్నారని ఆయన చెప్పారు. ఈమేరకు శుక్రవారం రాత్రి ప్రధాని మోడీ ఓ ట్వీట్ చేశారు. ‘‘మొదటి దశ ఎన్నికల్లో గొప్ప స్పందన! ఈరోజు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు. తొలి విడత ఓటింగ్ నుంచి అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ వచ్చింది. భారతదేశం అంతటా ప్రజలు రికార్డు సంఖ్యలో ఎన్డీయే కూటమికి ఓటు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది’’ అని ట్వీట్‌లో ప్రధాని పేర్కొన్నారు.


Next Story

Most Viewed