Delhi : తుపాకులు, కత్తులతో నలుగురు టీనేజర్ల ఎటాక్.. ఏమైందంటే..?

by Hajipasha |
Delhi : తుపాకులు, కత్తులతో నలుగురు టీనేజర్ల ఎటాక్.. ఏమైందంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో : 16, 17 ఏళ్ల నలుగురు టీనేజర్లు తుపాకులు, కత్తులతో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని కిషన్‌ఘర్ ఏరియాలో చెలరేగారు. మరో ఇద్దరు టీనేజర్ల(Minors)పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు చనిపోగా, 18 ఏళ్ల సౌరభ్ యాదవ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. శనివారం సాయంత్రం 5.45 గంటలకు కిషన్‌ఘర్ ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చాయి.

ఇద్దరు బాధిత టీనేజర్లతో సంజయ్ మెహ్లావత్ (38) అనే యువకుడికి గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. సంజయ్ మెహ్లావత్ సూచనల మేరకే నలుగురు టీనేజర్లు కత్తులు, తుపాకులు తీసుకొని ఈ దాడి చేశారని వెల్లడైంది. దీంతో సూత్రధారి సంజయ్ మెహ్లావత్‌తో దాడికి పాల్పడిన నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఒక బుల్లెట్ సహా పలు సాక్ష్యాలను సేకరించారు.

Advertisement

Next Story

Most Viewed