Fire accident: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

by vinod kumar |
Fire accident: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోహా పట్టణంలోని ధాతవ్ ఎంఐడీసీ సాధన నైట్రో కెమ్ లిమిటెడ్‌లో ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. కార్మికులు తమ పనిలో నిమగ్నమై ఉండగా.. ఫ్యాక్టరీలోని రసాయనాలు నిల్వ ఉంచిన ట్యాంకులో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని వెల్లడించారు. ఈ ఘటనలో స్టోరేజీ ట్యాంకు వద్ద పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. అలాగే దానికి పని చేస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన కార్మికులను రోహాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరణించిన వారి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed