'సరైన టైంలో జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు'

by Vinod kumar |
సరైన టైంలో జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు
X

న్యూఢిల్లీ: భద్రతా పరిస్థితుల దృష్యా సరైన సమయంలో జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే క్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కశ్మీర్‌లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలాగే ఉచితాలపై అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ఉచితాలు ప్రజాకర్షణ కలిగి ఉంటాయని చెప్పారు. అయితే వాటిని ఇచ్చేందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు.

Advertisement

Next Story