ECI : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ సమీక్ష

by Hajipasha |
ECI : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ సమీక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శుక్రవారం ముంబైలో పర్యటించారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముంబైలోని పలు పోలింగ్ స్టేషన్లలో వసతుల లేమితో ఓటర్లకు ఎదురైన అసౌకర్యంపై ఆయన సమీక్షించారు. దీంతోపాటు త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు రాజీవ్ కుమార్ కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీ, డీజీపీ, ఇతర సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సీఈసీ నిర్దేశించారు.

బెంచ్‌లు, ఫ్యాన్లు, తాగునీరు, షెల్టర్లు ఉండేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. అసౌకర్యంపై ఓటర్ల నుంచి ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీని ఆదేశించారు. అంతకుముందు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ రాజీవ్ కుమార్ సమీక్షించారు.

Advertisement

Next Story

Most Viewed