డెము రైల్లోని ఎనిమిది కోచ్‌లలో మంటలు!

by Vinod kumar |
డెము రైల్లోని ఎనిమిది కోచ్‌లలో మంటలు!
X

ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్, నారాయనపూర్ స్టేషన్‌ల మధ్య సోమవారం ఓ డెము(డీజిల్-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలులో మంటలు చెలరేగాయి. ప్రయాణీకులందరూ రైలులోంచి బయటకు వచ్చేయడంతో ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. డెము రైల్లోని ఎనిమిది కోచ్‌లలో మంటలు చెలరేగాయి.

సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రైలులో మంటలు సంభవించగా, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించామని అధికారులు చెప్పారు. మంటలు రేగిన కోచ్‌లలో ఎవరూ చిక్కుకోలేదని, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినట్టు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story