మరో జాబితా రిలీజ్ చేసిన కాంగ్రెస్: ఆరుగురు అభ్యర్థులకు చోటు

by samatah |
మరో జాబితా రిలీజ్ చేసిన కాంగ్రెస్: ఆరుగురు అభ్యర్థులకు చోటు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శనివారం మరో జాబితా రిలీజ్ చేసింది. ఈ లిస్టులో కేవలం ఆరుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. వాటిలో మధ్యప్రదేశ్‌లో 3 సీట్లు, గోవాలో 2, దాద్రా నగర్ హవేలీలో ఒక అభ్యర్థిని ఖరారు చేసింది. మధ్యప్రదేశ్‌లో మొరెనా నుంచి సత్యపాల్ సింగ్ సికార్వర్, గ్వాలియర్‌లో ప్రవీణ్ పాఠక్, ఖాండ్వా నుంచి నరేంద్ర పటేల్ పోటీ చేయనున్నారు. ఇక, గోవా నార్త్ నుంచి రమాకాంత్ ఖలప్, గోవా సౌత్ నుంచి కెప్టెన్ విరియాటో ఫెర్నాండెజ్ లను ప్రకటించింది. కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ నుంచి అజిత్ రాంజీభాయ్ మహ్లాను కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేసింది. తాజా జాబితాతో కలిసి కాంగ్రెస్ ఇప్పటివరకు 240 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించింది. కాగా, మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాలకు గానూ 28 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. ఖజురహో స్థానాన్ని ఎస్పీకి కేటాయించింది.

Advertisement

Next Story

Most Viewed