రేపట్నుంచి సివిల్స్ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

by Y. Venkata Narasimha Reddy |
రేపట్నుంచి సివిల్స్ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి ఏటా యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్‌(సీఎస్‌ఈ) 2024 పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా యూపీఎస్సీ జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిగా.. ఫలితాలు జులై 1న విడుదలయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్‌ 20, 21, 22, 28, 29 తేదీల్లో జరుగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో సెషన్‌ పరీక్ష మూడు గంటల పాటు జరుగుతుంది.

మెయిన్స్‌ పరీక్షలు మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. దేశవ్యాప్తంగా 24 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో మెయిన్స్‌ పరీక్షల కోసం 6 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 708 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని అధికారులు సూచించారు. మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్ధులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. మెయిన్స్‌, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా సర్వీసులను కేటాయిస్తారు. దేశ వ్యాప్తంగా ప్రతీయేట లక్షలాది మంది యువత సివిల్ సర్వీసెస్‌ లో ఎంపికయ్యేందుకు పోటీ పడుతుంటారు.

Advertisement

Next Story

Most Viewed