Hospitals Security :కేంద్ర ఆస్పత్రులకు 25 శాతం భద్రత పెంపు

by Hajipasha |
Hospitals Security :కేంద్ర ఆస్పత్రులకు 25 శాతం భద్రత పెంపు
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో వైద్యసంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద భద్రతను 25 శాతం మేర పెంచుతామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇంకా ఏవైనా ప్రభుత్వ ఆస్పత్రులకు భద్రత అవసరమైతే తమను సంప్రదించాలని, పరిస్థితిని బట్టి ఆయా ఆస్పత్రుల వద్ద కూడా తప్పకుండా మార్షల్స్‌ను మోహరిస్తామని వెల్లడించింది.

వైద్యులు, ఆస్పత్రులపై దాడులను నిరోధించడానికి ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లును వెంటనే చట్టరూపంలోకి తేవాలని వైద్యసంఘాలు కోరడాన్ని ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తప్పుపట్టాయి. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ దుర్ఘటన రోగులు, వైద్యుల మధ్య జరిగింది కాదని.. దానికి ముసాయిదా బిల్లుతో లంకె పెట్టడం సరికాదని వైద్య సంఘాలకు సూచించాయి. ఇప్పటికే 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్యులు, ఆస్పత్రుల భద్రతకు కఠిన చట్టాల్లో అమల్లో ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Next Story

Most Viewed