- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
14 పంటలకు ఎంఎస్పీ పెంపు.. మరో కీలక నిర్ణయం ఏమిటంటే..
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25కి సంబంధించి ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని 5.35 శాతం మేర పెంచింది. వరితో పాటు జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ నిర్ణయాలను కేంద్ర రైల్వే, సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు బుధవారం సాయంత్రం వెల్లడించారు. వరి కనీస మద్దతు ధరను రూ. 117 పెంచడంతో క్వింటాల్ ధాన్యం ధర రూ. 2,300కి చేరుకుంది. కనీస మద్దతు ధరతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ తీసుకుంది. మహారాష్ట్రలోని విధావన్ వద్ద గ్రీన్ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టును రూ.76,200 కోట్లతో అభివృద్ధి చేయాలని మోడీ సర్కారు నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రపంచంలోనే మొదటి 10 పోర్టుల్లో ఒకటిగా గ్రీన్ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ పోర్టు అవతరించనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సర్కారు అంచనా వేస్తోంది. వారణాసిలో అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2,870 కోట్లతో కొత్త టెర్మినల్ నిర్మాణం, రన్వే విస్తరణ అభివృద్ధికి ఆమోదం తెలిపారు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో రూ. 7,453 కోట్లతో 500 మెగావాట్ల సామర్థ్యంతో ఒక్కోటి చొప్పున విండ్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
పంటలకు మద్దతు ధరల పెంపు.. (రేట్లు క్వింటాలుకు)
పంట - మద్దతు ధర పెంపు - మొత్తం ధర
వరి (సాధారణం) - రూ.117 - రూ.2,300
వరి (గ్రేడ్-ఎ) - రూ.117 - రూ.2,320
జొన్న (హైబ్రిడ్) - రూ.191 - రూ.3,371
జొన్న (మాల్దండి)- రూ.196 - రూ. 3,421
సజ్జలు - రూ.125 - రూ.2,625
రాగులు- రూ.444 - రూ.4,290
మొక్కజొన్న- రూ.135 - రూ.2,225
వేరుశెనగ - రూ.406 - రూ.6,783
కంది- రూ.550 - రూ.7,550
మినుము- రూ.450 - రూ.7,400
పెసలు- రూ.124 - రూ.8,682
సోయాబీన్ (పసుపు)- రూ. 292 - రూ.4,892
పొద్దుతిరుగుడు విత్తనాలు- రూ.520 - రూ.7280
నువ్వులు- రూ.632 - రూ.9,267
పత్తి (మధ్యరకం)- రూ. 501 - రూ.7,121
పత్తి (లాంగ్ స్టెపెల్) - రూ.501 - రూ.7,521
నైజర్ సీడ్ - రూ.983 - రూ.8717