Delhi: ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఏసీ యూనిట్ మీద పడి బాలుడి మృతి

by S Gopi |   ( Updated:2024-08-18 19:16:50.0  )
Delhi: ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఏసీ యూనిట్ మీద పడి బాలుడి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో శనివారం ఎయిర్‌కండీషనర్ అవుట్‌డోర్ యూనిట్ మీద పడి ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుబయట స్నేహితుడితో కలిసి ఆడుకుంటున్న సమయంలో 2వ అంతస్తు నుంచి ఏసీ యూనిట్ జితేష్(18) తలమీద పడింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాలురు ఇద్దరూ గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, జితేష్ మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. మరో బాలుడు ప్రన్షు(17) చికిత్స పొందుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీస్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకోగా, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. అయితే, దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story