బీజేపీ 'యాక్టివ్ మెంబర్‌షిప్ క్యాంపెయిన్' ప్రారంభం.. మొదటి క్రియాశీల సభ్యుడిగా మోడీ

by Mahesh |   ( Updated:2024-10-16 09:19:18.0  )
బీజేపీ యాక్టివ్ మెంబర్‌షిప్ క్యాంపెయిన్ ప్రారంభం.. మొదటి క్రియాశీల సభ్యుడిగా మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎన్డీయే కూటమి.. అధికారంలోకి వచ్చింది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. దీని తర్వాత వచ్చిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను మంచి ఫలితాలను సాధించిన బీజేపీ.. దేశవ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ ను ప్రారంభించింది. ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో.. ఢిల్లీలో ప్రధాని మోడీ చేతుల మీదుగా బీజేపీ 'యాక్టివ్ మెంబర్‌షిప్ క్యాంపెయిన్'ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ బీజేపీ పార్టీ యొక్క మొదటి క్రియాశీల సభ్యుడిగా మారారు. అనంతరం నేటి నుంచే దేశవ్యాప్తంగా ఈ 'యాక్టివ్ మెంబర్‌షిప్ క్యాంపెయిన్' పెద్దఎత్తున నిర్వహించేందుకు బీజేపీ సిద్దం అయింది.

Advertisement

Next Story

Most Viewed