- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీదే అధికారం : బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
by Vinod kumar |
X
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ కావడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఎలక్షన్ కమిషన్ ప్రకటనను స్వాగతించిన నడ్డా.. ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లోనూ మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజారిటీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాబోయే ఐదేళ్లలో నిబద్దతతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనతో బీజేపీ, దాని మిత్ర పక్షాల ఫేర్ వెల్కు నగారా మోగినట్టైందని తెలిపారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, తదితర హామీలతో కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు.
Advertisement
Next Story