దుర్గా దేవిగా బీజేపీ ఎంపీ హేమా మాలిని.. పులిపై అమ్మవారి పాత్రలో నృత్య ప్రదర్శన

by Ramesh N |   ( Updated:2024-10-07 11:00:03.0  )
దుర్గా దేవిగా బీజేపీ ఎంపీ హేమా మాలిని.. పులిపై అమ్మవారి పాత్రలో నృత్య ప్రదర్శన
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఆదివారం నవ్ దుర్గా మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధుర ఎంపీ, ప్రముఖ నటి హేమా మాలిని దుర్గాదేవి నృత్య నాటక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇందులో హేమా మాలిని దుర్గామాత పాత్ర పోషించారు. పులిపై కూర్చున్న అమ్మవారిగా నృత్య ప్రదర్శన ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు బీజేపీ ఎంపీ.

ఈ కార్యక్రమం అనంతరం హేమ మాలిని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఇక్కడ ప్రదర్శన నేను ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా దుర్గామాత నృత్య నాటకం చూసి ప్రశంసించారు.’ అని వెల్లడించారు. దుర్గాదేవిగా హేమా మాలిని నృత్య నాటక ప్రదర్శన తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. అచ్చం దుర్గామాత అమ్మవారిలానే ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed