- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కశ్మీర్లో మరో ఎన్కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా..ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. బారాముల్లాలోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఆచూకీ ఉందన్న సమాచారం మేరకు పోలీసులు, ఆర్మీ బలగాలు బుధవారం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. టెర్రరిస్టులు దాగి ఉన్న ప్రదేశానికి చేరుకోగానే ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరపగా..ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతి చెందిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వ్యక్తులో వెల్లడించలేదు. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అంతకుముందు సోమవారం బందిపొరాలో భద్రతా దళాలు ఉగ్రవాద ఎల్ఈటీ కమాండర్ ఒమర్ అక్బర్ లోన్ అలియాస్ జాఫర్ను హతమార్చాయి. కాగా, వరుస ఉగ్ర కదలికలతో కశ్మీర్లో ఆందోళనలు నెలకొన్నాయి.