జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్ కౌంటర్.. ఆర్మీ జవాన్ వీర మరణం

by Satheesh |
జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్ కౌంటర్.. ఆర్మీ జవాన్ వీర మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ భారత జవాన్ వీర మరణం చెందాడు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే గాయపడిన జవాన్లు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా, కుల్గాం జిల్లాలో ముష్కారులు నక్కి ఉన్నారన్న విశ్వసనీయ సమావేశం మేరకు భారత భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే సైనికులకు ఎదురుపడిన టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భారత జవాన్లు సైతం ఎదురు కాల్పులకు దిగారు. ఉగ్రవాదులు చాటుగా చేసిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతి చెందగా, మరో ఇద్దరు అధికారులు గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed