- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
సిగరెట్ కోసం ఘాతుకం.. దుండగుడి కాల్పుల్లో తెలుగు యువకుడి మృతి
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా గన్ కల్చర్ మరో భారతీయుడిని బలిగొంది. ఆర్కెన్సాస్ రాష్ట్రంలోని ఓ సూపర్ మార్కెట్లో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) ప్రాణాలు కోల్పోయాడు. గోపీకృష్ణ ఇండియాలోనే ఎంఎస్ పూర్తి చేశాడు. జీవనోపాధి కోసం 8 నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఆర్కెన్సాస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఓ దుండగుడు ఆ సూపర్ మార్కెట్లోకి వస్తూనే కాల్పులు మొదలుపెట్టాడు. అక్కడున్న వారిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి కాల్చాడు. ఇదేవిధంగా గోపీకృష్ణను కూడా గన్తో కాల్చాడు. అనంతరం దుండగుడు ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో సిగరెట్ ప్యాకెట్ కోసమే అతడు కాల్పులు జరిపాడని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో గాయపడిన 13 మందిని హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్పించారు. చికిత్సపొందుతూ దాసరి గోపీకృష్ణతో పాటు మరో ఇద్దరు ఆదివారం ఉదయం చనిపోయారు. ఇంకో 10 మందికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.అందులోని సీన్లను బట్టి కాల్పులు జరిపిన దుండగుడి వయసు 16 ఏళ్లే ఉంటుందని అంచనా వేస్తున్నారు.