- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఇండియా హిందూ దేశం.. ఇదే నిజం : RSS chief Mohan Bhagwat
నాగ్ పూర్ : భారత్ హిందూ దేశమని, సైద్ధాంతికంగా భారతీయులంతా హిందువులేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హిందువులు అంటే భారతీయులందరూ అనే అర్ధం వస్తుందన్నారు. శుక్రవారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతదేశంలో ఉన్నవారంతా హిందూ సంస్కృతికి, హిందూ పూర్వీకులకు, హిందూ భూమికి సంబంధించినవారే తప్ప మరేమీ కాదు. కొంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు.
ఇంకొందరు తెలిసినా తమ మూలాలను అనుసరించడం లేదు’’ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత భావజాలానికి మంచి గౌరవం ఉందన్నారు. న్యూస్ రిపోర్టింగ్ లో ఉన్నవారంతా సంస్థ భావజాలాన్నిఅనుసరిస్తూనే.. నిష్పాక్షికంగా, వాస్తవికంగా సమాచారాన్ని పాఠకులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.