- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Home > జాతీయం-అంతర్జాతీయం > Tea Meeting : టీ మీటింగ్లో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ.. ‘నమస్తే’ అంటూ పలకరింపులు
Tea Meeting : టీ మీటింగ్లో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ.. ‘నమస్తే’ అంటూ పలకరింపులు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరస్పరం విష్ చేసుకున్నారు. ‘నమస్తే’ అంటూ నవ్వుతూ పలకరించుకున్నారు. శుక్రవారం లోక్సభ వాయిదా పడిన అనంతరం పార్లమెంటు కాంప్లెక్సులో అనధికారిక టీ మీటింగ్ జరిగింది. ఇందులో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో పాటు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, కింజారపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్, పీయూష్ గోయల్, ఎంపీలు కనిమొళి తదితరులు పాల్గొన్నారు. విపక్ష నేతలకు ఎదురుగా ఉన్న కుర్చీల వరుసలో అమిత్ షా, రాజ్నాథ్ కూర్చున్నారు. వీరందరూ ముచ్చటించుకుంటూ టీ తాగారు.
Advertisement
Next Story