- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
విషాదం మిగిల్చిన విహార యాత్ర.. జలపాతంలో ఏమైందంటే..
![విషాదం మిగిల్చిన విహార యాత్ర.. జలపాతంలో ఏమైందంటే.. విషాదం మిగిల్చిన విహార యాత్ర.. జలపాతంలో ఏమైందంటే..](https://www.dishadaily.com/h-upload/2024/06/30/347657-mumbai-water-fals.webp)
దిశ, నేషనల్ బ్యూరో : విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం సెలవురోజు కావడంతో మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఆ కుటుంబంలోని ఏడుగురు కలిసి ముంబై సమీపంలోని లోనోవాలా ప్రాంతం సందర్శనకు వెళ్లారు. సరదాగా వారంతా కలిసి అక్కడున్న భూసీ డ్యామ్ సమీపంలోని జలపాతంలోకి దిగారు. అప్పటివరకు నెమ్మదిగానే ఉన్న జలప్రవాహం వేగం అకస్మాత్తుగా పెరగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆ ఏడుగురు ఒకేసారి కొట్టుకుపోసాగారు. ఈక్రమంలో ఇద్దరు సాహసోపేతంగా వ్యవహరించి ఈదుకుంటూ అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు రక్షించుకున్నారు. మిగతా ఐదుగురికి ఈత రాకపోవడంతో జల ప్రవాహంలో కొట్టుకుపోయారు.
ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వెంటనే జలపాతంలో రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. తాళ్ల సాయంతో ట్రెక్కింగ్ చేస్తూ ఆ ఐదుగురి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించారు. ఆదివారం సాయంత్రం సమయానికి మూడు డెడ్బాడీస్ దొరికాయి. ఆ కుటుంబానికి చెందిన 36 ఏళ్ల మహిళ, 13 ఏళ్ల బాలిక, 8 ఏళ్ల బాలిక డెడ్బాడీస్ లభ్యమయ్యాయి. వీరంతా భూసీ డ్యామ్ నుంచి చాలాదూరం కొట్టుకుపోయి రిజర్వాయర్లో మునిగి చనిపోయినట్లు గుర్తించారు. బాధిత ఫ్యామిలీకే చెందిన తొమ్మిదేళ్ల బాలుడు, నాలుగేళ్ల బాలిక ఆచూకీ కోసం జలపాతంలో గాలింపు కొనసాగుతోంది.