Jammu Kashmir: ఘోర ప్రమాదం.. ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి

by Shamantha N |
Jammu Kashmir: ఘోర ప్రమాదం.. ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాహనం లోయలో పడి 8 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. దక్సమ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కిష్త్వార్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. టాటా సుమో కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో యాక్సిడెంట్ జరిగిందన్నారు. కారు అదుపుతప్పి బోల్తా పడి లోయలో పడిపోయిందన్నారు. కాగా.. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇకపోతే, జమ్ముకశ్మీర్ లో ఇటీవల ప్రమాదాలు పెరిగిపోయాయి. రాజౌరీ, రియాసీ జిల్లాల్లో వరుసగా రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు.

Advertisement

Next Story

Most Viewed