- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఆసక్తికర పరిణామం.. లొంగిపోయిన 30 మంది మావోయిస్టులు
by GSrikanth |
X
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకేసారి 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ డీఐజీ అండ్ బీజాపూర్ ఎస్పీ సమక్షంలో మంగళవారం లొంగిపోయారు. కాగా, ఈ మధ్య కాలంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య తరచూ ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజూ ఎక్కడో చోట పలువురు భద్రతా బలగాలు, మావోయిస్టులు మృతిచెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు ముందు రోజు కూడా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 10 మంది వరకు మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. ఇలాంటి తరుణంలో ఒకేసారి 30 మంది మావోయిస్టులు లొంగిపోవడం చర్చనీయాంశమయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story