- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Steel Plant Mishap : స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. ఇద్దరి మృతి, ఐదుగురు విషమం
X
దిశ, నేషనల్ బ్యూరో : ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా బుధిపడార్లో ఉన్న ఒరిస్సా మెటాలిక్స్ స్టీల్ ప్లాంటులో ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం 11 గంటలకు అకస్మాత్తుగా మెటల్ ప్లేట్ విరిగి పడటంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలవగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన కార్మికులను 34 ఏళ్ల పూర్ణచంద్ర జెనా (ఒడిశా), 39 ఏళ్ల అలేక్ దేవ్ సాహూ (జార్ఖండ్)గా గుర్తించారు. ఈ ఘటనను నిరసిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేసి ఆందోళన విరమింపజేశారు.
Advertisement
Next Story