అచ్చెన్న త్వరగా కోలుకోవాలి: లోకేశ్

by  |
అచ్చెన్న త్వరగా కోలుకోవాలి: లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. దీంతో నారా లోకేశ్ స్పందించారు. అచ్చెన్నాయుడు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నా అని అన్నారు. అరోగ్యం బాగాలేక పోయినా, ఆపరేషన్ చేయించుకున్నా.. ప్రభుత్వం అచ్చెన్నపై కక్ష సాధించిందని.. తాజాగా కరోనా సోకడం బాధాకరమన్నారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా, ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


Next Story

Most Viewed