దళితుల పై జగన్ దమనకాండ: లోకేశ్

by  |
దళితుల పై జగన్ దమనకాండ: లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: దళితుల పై జగన్ రెడ్డి దమనకాండకి అంతే లేదా అని టీడీపీ లీడర్ నారా లోకేశ్ నిలదీశారు. ప్రభుత్వం పై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన లోకేశ్.. వైసీపీ పాలనలో దళిత జాతి పై దాడులు పెరిగాయన్నారు. వారానికో దాడి, నెలకో శిరోముండనం, మూడు నెలలో హత్య చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా.. దళితుల పై పిచ్చోళ్లనే ముద్ర, శిరోముండనం, కొట్టి చంపడం, నిప్పంటించడం ఎప్పుడైనా జరిగాయా అంటూ ప్రశ్నించారు. దళితులను ఇంత ఘోరంగా అవమానించిన పాలకుడు జగన్ రెడ్డి ఒక్కరే అంటూ లోకేశ్ ఆరోపించారు.


Next Story

Most Viewed