మోసం చేయడం చంద్రబాబు నైజం

by  |
మోసం చేయడం చంద్రబాబు నైజం
X

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఏజెన్సీ గిరిజనులను చంద్రబాబు ఇప్పటికీ మోసగిస్తున్నారని మండిపడ్డారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తానని.. గిరిజనులను ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్సీలుగా చేస్తానని అంటున్నాడు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచినట్లే గిరిజనులను మోసం చేస్తాడని విజయసాయి విమర్శించారు. ఇక జగన్ తన తండ్రిలాగే గిరిజనులకు మంచి చేస్తాడని విజయసాయి అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.


Next Story

Most Viewed