అయ్యా కొడుకులకు ‘కాషాయం’ గుబులు..

by Shyam |
అయ్యా కొడుకులకు ‘కాషాయం’ గుబులు..
X

దిశ, అల్వాల్​ : అయ్యా కొడుకులకు కాషాయం గుబులు పట్టుకున్నదని నిజామాబాద్​ఎంపీ అర్వింద్​ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మచ్చబొల్లారం సంజీవ రెడ్డి ఫంక్షన్​హాల్లో మేడ్చల్​జిల్లా అర్బన్​ అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, భూదందాలు, హిందువులపై జరుగుతున్న దాడులకు టీఆర్ఎస్​ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్​పట్టభద్రుల ఎన్నికలు మినీ రాష్ట్ర ఎన్నికలను తలపిస్తున్నాయని, ఇది టీఆర్ఎస్​ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేక తీర్పుకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఓడిపోతామని తెలిసే పీవీపై ఉన్న సెంటిమెంట్ అయినా పనికి రాకపోతదా అని ఆయన కుమార్తెను బరిలోకి దింపారన్నారు.

నిజంగా పీవీ కూతురుపై ప్రేమే ఉంటే ఓడిపోయినా నామినేటేడ్​ పదవి ఇవ్వగలరా అని టీఆర్ఎస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న కళ నెరవేరాలంటే మేధావులైన పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు రాంచంద్రర్​రావుకు వేయాలని కోరారు. తీస్​మార్క్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న మైనంపల్లి హన్మంతరావు ఏడువందల ఓట్లతోని గెలిచి విర్రవీగడం కాదని, వచ్చే ఎన్నికల్లో ఏడు వేల ఓట్లతో బీజేపీ మల్కాజిగిరిలో కాషాయ జెండా ఎగురవేస్తుందని జోష్యం చెప్పారు. అంతకుముందు హరీశ్‌రెడ్డి, అరుల్​రాజు, శ్రావణ్​గౌడ్, రాశి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో రవిందర్​‌రెడ్డి, మచ్చబొల్లారం డివిజన్​ అధ్యక్షుడు ప్రకాశ్‌చౌదరి, నవీన్​చంద్ర, సీనియర్​ నాయకులు విసి. జగదీశ్, సామల సత్తిరెడ్డి, నిమ్మ కృష్ణరెడ్డి, నేమూరి శ్రీధర్​‌గౌడ్, మల్లికార్జున్​‌గౌడ్, కార్తీక్​‌గౌడ్​పాల్గొన్నారు.

Next Story

Most Viewed