పూరీ డ్రామా మామూలుగా లేదుగా.. ఈసారి రామ్ బుర్రలో ఎవరి 'చిప్' వాడనున్నారంటే?

by Anjali |
పూరీ డ్రామా మామూలుగా లేదుగా.. ఈసారి రామ్ బుర్రలో ఎవరి చిప్ వాడనున్నారంటే?
X

దిశ, సినిమా: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. రామ్ పోతినేని కలయికలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’చిత్రం కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గానే హనుమాన్ ప్రొడ్యూసర్స్ ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్స్ వాళ్లు ఈ చిత్రం వరల్డ్ వైడ్ హక్కులను రూ.54 కోట్లకు బాక్సాఫీసు హక్కులను సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అలాగే అన్ని లాంగ్వేజేస్‌లో ఓటీటీ రైట్స్ అమెజాన్ రూ33 కోట్ల రూపాయలు, ఆదిత్య సంస్థ ఆడియో రైట్స్ 9 కోట్ల రూపాయలుకు కొన్నదట.

ఆగస్టు 15 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ విడుదల కానున్న ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ పాత్రలో మెరవనున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి టీజర్, సింగిల్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచింది. రెండు సార్లు ఈ మూవీ నుంచి పాటలు కూడా విడిచారు. రెండో పాట కేసీఆర్ డైలాగ్ వాడటంతో కాస్త వివాదం తెచ్చిపెట్టింది కానీ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక రామ్ పోతినేని ఊరమాస్ డైలాగ్స్.. యాటిట్యూడ్ ఫస్ట్ పార్ట్‌లో చూసే ఉంటారు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా రానున్న చిత్రమే ఈ డబుల్ ఇస్మార్ట్. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు.

అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రామ్ మెదడులో చిప్ పెట్టి ప్రజలకు కొత్తగా చూపించిన విషయం విషయం తెలిసిందే. సత్యదేవ్ చిప్ రామ్‌ మెదడులో ఫిక్స్ చేస్తారు. అయితే ఈ సారి సంజయ్ దత్ చిప్ వాడనున్నారని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఈసారి పూరీ క్రియేట్ చేయబోయే డ్రామా మామూలుగా లేదుగా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. 'పూరి కనెక్ట్స్' బ్యానర్‌పై హీరోయిన్ ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed