ఆ ఒక్కటి చేయకుండా ఉండాల్సింది..చార్మి కెరీర్‌ను నాశనం చేసింది ఆ నిర్ణయమేనా?

by Jakkula Samataha |
ఆ ఒక్కటి చేయకుండా ఉండాల్సింది..చార్మి కెరీర్‌ను నాశనం చేసింది ఆ నిర్ణయమేనా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈమె సొంతం. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యిందనే చెప్పవచ్చు. అప్పటి వరకు మంచి క్రేజ్ సంపాదించుకొని, ఇక తన కెరీర్‌ను నెంబర్ వన్ పొజిషన్‌లో నిలబెట్టుకుంటుంది అనుకునేలోపే తాను తీసుకున్న ఓ నిర్ణయం, తన లైఫ్‌నే రిస్క్‌లో పడేసింది. తన కెరీర్ నాశనం అయ్యేలా చేసింది అంటున్నారు తన అభిమానులు.

అయితే నీకే మనసిచ్చా చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా శ్రీ ఆంజనేయం, గౌరి సిమాలతో ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఈ అమ్మడు కెరీర్ మారిపోనుంది అని అనుకున్నారు. ఎందుకంటే? తర్వాత ఈ బ్యూటీకి మంగళ, మాస్, రాఖీ, లక్ష్మీ, చక్రం, పౌర్ణమి వంటి చాలా సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. అంతే కాకుండా మంగళ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. అలాంటి సమయంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతి లక్ష్మి సినిమాలో వేశ్య పాత్రలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన నటను చూసి ఎంతో మంది ప్రశంసించారు. దీంతో ఈ అమ్మడు స్టార్ రేంజ్‌కు ఎదగడం ఖాయం అనుకున్నారు అందరు. కానీ అప్పుడు ఆమె తీసుకున్న ఓ నిర్ణయం తన కెరీర్‌ను నాశనం చేసిదంట.

జ్యోతి లక్ష్మి సినిమా సమయంలో ఛార్మికి పూరీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి వారు డేటింగ్‌లో ఉన్నారంటూ అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. అంతే కాకుండా వీరు ఇద్దరు కలిసి పార్టీలకు వెళ్లడం, సినిమా ఈవెంట్స్‌కు వెళ్లడంతో ఆ రూమర్స్ నిజమేనేమో అనే అనుమానం కలిగింది. దీంతో ఛార్మికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ కెరీర్ క్లోజ్ అయ్యింది అంటున్నారు జనాలు.

Advertisement

Next Story