వరుణ్‌‌తేజ్‌ ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్‌ (వీడియో)

by GSrikanth |
వరుణ్‌‌తేజ్‌ ‘గాండీవధారి అర్జున’ ట్రైలర్‌ (వీడియో)
X

దిశ, సినిమా: వరుణ్‌ తేజ్‌ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది. యాక్షన్‌ మోడ్‌లో రూపొందిన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. డిసెంబర్ 2020 తర్వాత దేవుడు మీద మనిషి గెలిచాడంటా అనే డైలాగ్‌తో మొదలై జస్ట్ పాతిక వేల సంవత్సరాలలో మనుషులు చేసిన వస్తువులు దేవుడిని మించేసాయటతో ముగిసింది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో యుద్ధ పరికరాలు.. ఆయుధ సామాగ్రి దేశాలను తీవ్రవాదం, ఉగ్రవాదం వైపు నెడుతున్నట్టు ఈ ట్రైలర్‌లో చూపెట్టారు. ఇందులో నాజర్ అతిథి రాజ్ బహదూర్ పర్యావరణ శాఖ మంత్రిగా నటించారు. మొత్తానికి మూవీ బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉంది.

Advertisement

Next Story