'వారిసు'.. 'బృందావ‌నం' సినిమాకు రీమేకా?

by Hamsa |   ( Updated:2022-12-25 08:30:52.0  )
వారిసు.. బృందావ‌నం సినిమాకు రీమేకా?
X

దిశ, సినిమా: తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'వారిసు'. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్, లిరికల్ సాంగ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాతో నిర్మాత‌గా దిల్‌రాజు త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదిలాఉంటే.. 'వారిసు' మూవీ ఎన్‌టీఆర్ హీరోగా న‌టించిన 'బృందావ‌నం' సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కుతున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. అయితే ఈ విషయంపై శ‌నివారం చెన్నైలో జ‌రిగిన 'వారిసు' ఆడియో లాంచ్ ఈవెంట్‌లో దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. 'ఇది 'బృందావ‌నం' రీమేక్ కాదు. స్ట్రెయిట్ క‌థ‌తోనే ఈ సినిమా చేస్తున్నాం. అసలు తారక్ మూవీకి, దీనికి ఎలాంటి సంబంధం ఉండదు' స్పష్టం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed