రచ్చ మూవీలో చిన్పప్పుడు తమన్నా క్యారెక్టర్‌లో నటించిన ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్‌

by Anjali |
రచ్చ మూవీలో చిన్పప్పుడు తమన్నా క్యారెక్టర్‌లో నటించిన ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు.. స్టార్ హీరోయిన్ల చిన్ననాటి పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గంగోత్రి చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన కావ్య కల్యాన్ రామ్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వేణు దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమాలో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్‌లో మరిన్ని సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. అయితే ఇలాగే ఒకప్పుడు ‘రామ్ చరణ్’ హీరోగా నటించిన ‘రచ్చ’ సినిమాలో తమన్నా క్యారెక్టర్‌లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం హీరోయిన్‌గా దూసుకుపోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి పేరు విషికా లక్ష్మణ్. ఈ అమ్మడు ప్రస్తుతం ‘ ఏందిరా ఈ పంచాయితీ, సగిలేటి కథ’ లాంటి మూవీల్లో కథానాయికగా నటిస్తోంది. తాజాగా విషికా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలను పంచుకుంది. ‘‘రచ్చ మూవీనే కాకుండా చాలా సినిమాల్లో నటించాను. ఈ చిత్రం షూటింగ్ సమయంలో నేను చరణ్, తమన్నాను కలవలేదు. షూటింగ్ టైంలో వాళ్లు అక్కడ లేరు. ఇప్పుడు వారు నన్ను చూసినా అస్సలు గుర్తుపట్టరు. ఇదే నా లాస్ట్ మూవీ. ఈ తర్వాత చదువులో బిజీ అయ్యాను.’’ అంటూ విషికా వెల్లడించింది.







Next Story

Most Viewed