ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పిన 'వినరో భాగ్యము విష్ణుకథ' టీమ్

by Hamsa |
ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పిన వినరో భాగ్యము విష్ణుకథ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యమ విష్ణుకథ'. ఈ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్స్‌లో విడుదలైంది. అయితే అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో మూవీ టీమ్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ప్రకటించారు.

ప్రేక్షకులను థియేటర్స్‌లోకి రప్పించుకునేందుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒకటి టికెట్ కొంటే ఒకటి ఫ్రీ అని తెలిపారు. ఈ బుధ, గురువారాల్లో 'వినరో భాగ్యమ విష్ణు కథ' సింగల్ స్క్రీన్లలో ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ ఆఫర్‌ని అమలు చేయబోతున్నారు. అంటే రూ. 110, నుండి రూ.150 ఇద్దరు చూడొచ్చు. ఈ లెక్క ప్రకారం బాల్కనీ టికెట్ కేలవం రూ. 75 పడుతుందట. ఈ ఆఫర్‌ను మొదటి వారం కాక ముందే ఇలాంటి స్కీం పెట్టడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed